
మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండల పంచాయతీ కార్యదర్శుల కొత్త కార్యవర్గం ఎన్నికను మండల పరిషత్ ఆఫీసులో మంగళవారం నిర్వహించారు. అధ్యక్షునిగా గంగిపల్లి కార్యదర్శి కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షునిగా జె.రేవంత్రెడ్డి, ఉపాధ్యక్షునిగా ఎ.పద్మలత, ప్రధాన కార్యదర్శిగా వేముల జయరాజ్, ట్రెజరర్గా సుష్మిత,ఆర్గనైజింగ్ సెక్రటరీగా చవన్ లాల్, ప్రచార కార్యదర్శి శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీలుగా జీవిత, అనిత, కార్యవర్గ సభ్యులుగా కె.ఆనంద్, శిరీష , అశోక్, అనిత ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారులుగా ఎంపీడీవో వరలక్ష్మీ , ఎంపీవో కిరణ్ వ్యవహరించారు.