జేసీబీలో ఊరేగిన కొత్తజంట

జేసీబీలో ఊరేగిన కొత్తజంట

కొత్తగా పెళ్లైన జంటను గుర్రపు బండి లేదా కారులో ఊరేగిస్తారు. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో జేసీబీలో ఊరేగించారు. మ్యాదరిపేట గ్రామానికి చెందిన వర్షిణి,అదే మండలంలోని వెంటాపూర్ గ్రామానికి చెందిన శశాంక్  వివాహం శుక్రవారం మ్యాదరిపేట లో  జరిగింది. కొత్తగా పెళ్ళైన జంటను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ జేసీబీని పువ్వులతో ముస్తాబు చేసి అందులో ఊరేగించారు.