
టాలీవుడ్ ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన మోస్ట్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. ఈ మూవీ నేడు (మే30న) ప్రేక్షకుల ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటుంది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో సతమవుతున్న ఈ ముగ్గురు హీరోలకి భైరవం పెద్ద సక్సెస్ ఇచ్చిందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూవీ టీమ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసింది.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు. అంతేకాదు తన తండ్రి మోహన్ బాబు పెదరాయుడు ఫొటోతో కలిపి, గజపతి పాత్ర ఫొటోను పోస్ట్ చేశాడు. దీనికి ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’ అంటూ మనోజ్ క్యాప్షన్ పెట్టి అందరిలో ఆసక్తి పెంచాడు.
Ayyana Koduku Vachadu ani chepu 💥🔥 pic.twitter.com/UMumguQqru
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 30, 2025
అయితే, ఈ పోస్ట్ మంచు విష్ణుని రెచ్చగొట్టే విధంగా ఉందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అలాగే, స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చినపుడు తండ్రికి చెప్పుకోవాలి కదా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ పోస్టుపై మంచు ఫ్యామిలీలో ఎవరు స్పందిస్తారో చూడాలి.
భైరవం మూవీ ప్రమోషన్స్ లో చాలా సార్లు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును గుర్తుచేసుకున్నాడు. నమ్మిన వాళ్లను బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం నాన్న నుంచే నేర్చుకున్నా అని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా నాన్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని, నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నానని, నాన్నే తనకి హీరో అని ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ లేటెస్ట్ పోస్ట్ తో మరోసారి తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
►ALSO READ | Bhairavam Review: ‘భైరవం’ ఫుల్ రివ్యూ.. సినిమా కథేంటీ? ముగ్గురు హీరోలు కమ్బ్యాక్ ఇచ్చేనా?
అయితే, అనివార్య కారణాల వల్ల తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమయిన మనోజ్ కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. డైరెక్టర్ విజయ్ ఇందులో మనోజ్ ను కొత్త కోణంలో చూపించాడు. మనోజ్ రెండు షేడ్సులో కనిపించి తన విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం మంచు మనోజ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. హీరోగా, విలన్ గా మూవీస్ చేస్తున్నారు. తేజ సజ్జా మిరాయ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి, వాట్ ది ఫిష్ మరియు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు.