
మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీ జూన్ 27న రిలీజై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే కన్నప్ప మూవీ పైరసీ బారిన పడింది. నేడు (జూన్ 30న) కన్నప్ప పైరసీపై విచారం వ్యక్తం చేస్తూ 'హార్ట్ బ్రేకింగ్' అని విష్ణు ట్వీట్ చేశాడు.
‘ప్రియమైన సినిమా ప్రియులారా, కన్నప్ప పైరసీ దాడిలో ఉంది. ఇప్పటికే 30,000కి పైగా అక్రమ లింక్లను తొలగిస్తూ చర్యలు తీసుకున్నాం. పైరసీ అంటే దొంగతనం. స్పష్టంగా చెప్పాలంటే.. పిల్లలకు దొంగతనం చేయొద్దని ఎలానైతే నేర్పిస్తామో.. అలాగే, పైరసీ కంటెంట్ చూడొద్దని చెప్పడం ఒక్కటే. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్’అని విష్ణు పోస్ట్ పెట్టారు.
Dear movie lovers,#Kannappa is under attack from piracy. Over 30,000 illegal links have already been taken down. This is heartbreaking.
— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025
Piracy is theft — plain and simple. We don’t teach our children to steal. Watching pirated content is no different.
Please don’t encourage…
అయితే, భారతీయ కాపీరైట్ చట్టాల ప్రకారం, పైరేటెడ్ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడం వల్ల రూ. 2 లక్షల వరకు జరిమానాలు విధించవచ్చు మరియు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
వాస్తవానికి, కన్నప్ప మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. సినిమా యొక్క పైరేటెడ్ కాపీలు Tamilrockerz, Filmyzilla, Movierulez మరియు టెలిగ్రామ్ ఛానెల్లతో సహా అక్రమ సైట్లలో అప్లోడ్ చేయబడింది. ఈ వెర్షన్లు HD 1080p నుండి తక్కువ-రిజల్యూషన్ 240p వరకు ఉన్నాయి.
►ALSO READ | Kannappa: ‘కన్నప్ప’ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు: హీరో మంచు విష్ణు
ఏదేమైనా కన్నప్ప లాంటి చారిత్రక ఇతిహాస గాథను థియేటర్లో చూసి ఆనందించడం ఉత్తమం. కన్నప్ప మూవీ మూడు రోజుల్లో ఇండియా వైడ్గా రూ.22.53 కోట్లు నెట్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.