క్వాలిటీ బొగ్గును సప్లయ్​చేయాలె : జీఎం ఎ.మనోహర్

క్వాలిటీ బొగ్గును సప్లయ్​చేయాలె : జీఎం ఎ.మనోహర్
  •     మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్

కోల్​బెల్ట్, వెలుగు : వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు సప్లయ్​చేసినప్పుడే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​గనిపై మల్టీ డిపార్ట్​మెంటల్​కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ ఓసీపీల్లో మిషన్ల కెపాసిటీని పూర్తిస్థాయిలో వినియోగించుకొని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా చేయాలన్నారు. 

కంపెనీ భవిష్యత్​నిర్దేశిత టార్గెట్​చేరుకోవడంపై ఆధారపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్, కమిటీ కన్వీనర్,​ఏరియా ఏస్​ఓటుజీఎం రాజేశ్వర్​రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను వేగవంతం

 చేయాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి జాతర ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.