రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన మన్మోహన్‌ సింగ్‌ తన నామినేషన్‌ దాఖలు చేయున్నారు.రాజస్తాన్ నుంచి ఆయనను రాజ్యసభ బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఆగస్టు 13న ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

మన్మోహన్ సింగ్ 1995, 2001, 2007, 2013లో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1998-2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మన్మోహన్‌ సింగ్‌ కొనసాగారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా రాజ్యసభ ఎంపీగానే ప్రధాన మంత్రిగా పదేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు.