వానాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగర వాసులకు ఇబ్బందులు తప్పవు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు GHMC సరికొత్త కార్యాచరణ రూపొందించింది. మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసి… ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మోటార్లు ఏర్పాటు చేసి వరద నీరు తొలగించడం..ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచేలా కొలనులు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వాతావరణ శాఖ సూచనలతో వర్షం కురిసే గంట ముందే సీనియర్ అధికారులు, సిబ్బంది నిర్ణీత ప్రాంతాలకు చేరుకుని వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చేయనున్నారు. GHMC కమిషనర్ దానకిశోర్ వరుసగా కురుస్తుండటంతో జోనల్, డిప్యూటి, అదనపు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.