కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం

కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు,ఆర్ కొత్తగూడెం రహదారిలో మార్చి 18న మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపాయి. మార్చి 23ను భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురు ల అమరత్వ దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్రజా వ్యతిరేక హిందూ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు సాగించాలని మావోయిస్టులు కరపత్రాల్లో వెల్లడించారు. కుదునురు, ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారి.. దానవాయిపేట, చింతగుప్పా, వెంకటాపురం రహదారిలో మావోయిస్టులు ఈ బ్యానర్లు, కరపత్రాలను అతికించారు. 

తెలంగాణ కమిటీ భారత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ కరపత్రాలు వెలిశాయి. దీంతో సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీస్‌ యం త్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గస్తీ నిర్వహి స్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామీణ పల్లెలను జల్లెడ పడుతున్నారు.