
బషీర్బాగ్, వెలుగు: అపార్ట్మెంట్ ఖాళీ స్థలంలో గంజాయి సాగు చేస్తున్న వాచ్మెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్కు చెందిన కైలాష్ జోషి (45) నారాయణగూడలోని నీరజ్ విల్లా అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. గంజాయి అలవాటు ఉండడంతో సొరకాయ, కాకరకాయ విత్తనాల మధ్య గంజా విత్తనాలు నాటి సాగు చేశాడు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితుడిని అరెస్ట్ చేశారు. 4.2 కేజీల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.
శామీర్పేట: ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని శామీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. 42 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నాటక బీదర్కు చెందిన బెల్లాలే ప్రవీణ్ (31), రహీంపురకు చెందిన అవినాష్ జాదవ్ (22), మంగళహాట్కు చెందిన సతీశ్ గా గుర్తించారు.