మార్క్ ఆంటోని మూవీ రాబోతున్న సందర్భంగా ఈ బర్త్​డే నాకెంతో స్పెషల్ : విశాల్

మార్క్ ఆంటోని మూవీ రాబోతున్న సందర్భంగా ఈ బర్త్​డే నాకెంతో స్పెషల్ : విశాల్

విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మార్క్ ఆంటోని’. రీతూ వర్మ హీరోయిన్. ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. మంగళవారం విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్. ఎందుకంటే ‘మార్క్ ఆంటోని’ చిత్రంతో సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకొస్తున్నా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఈ పీరియాడిక్ మూవీలో రెండు డిఫరెంట్ రోల్స్‌‌‌‌లో నటించాను. ఈ రెండు లుక్స్‌‌‌‌కి అద్భుతమైన స్పందన లభించింది. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్‌‌‌‌ను ఇస్తుంది’ అని చెప్పాడు. ఎస్‌‌‌‌.జె.సూర్య కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.