న్యూఢిల్లీ : టెక్ స్టార్టప్ అమ్లెగో ల్యాబ్స్లో 6.44 శాతం వాటాను కొనుగోలు చేశామని మారుతి సుజుకీ ప్రకటించింది. డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వీస్లను అందించే ఈ స్టార్టప్ కంపెనీలో సుమారు రూ.1.99 కోట్లను మారుతి సుజుకీ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది.
2022 జూన్లో ఏఐ స్టార్టప్ కంపెనీ సోషియోగ్రాఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా కొంత వాటాను కొనుగోలు చేసింది. మారుతి సుజుకీ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కింద 2019 నుంచి సార్టప్లతో కలిసి పనిచేస్తున్నామని కంపెనీ సీఈఓ హిసాషి టకెయుచి అన్నారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.