ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి..

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి..

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 నెలల చిన్నారి సహా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు మృతి చెందారు. ఈ ఘటన ఢిల్లీలోని షాదాపా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పై అంతస్తుకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా పొగ అలుముకోవడంతో ఊపిరాడక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

సమాచారం అందుకున్న  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ప్రమాదం సమయంలో పై అంతస్తులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు (9 నెలల చిన్నారితోపాటు, ఇద్దరు మహిళలు, ఓ బాలుడు) మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని...  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.