- 12 తులాల బంగారం, రూ.18 లక్షలు అపహరణ
జోగిపేట, వెలుగు: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. అల్లాదుర్గానికి చెందిన చెగురి లక్ష్మిదేవి హైదరాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు బయలుదేరింది. జోగిపేటలో వారి బంధువులను వెంట తీసుకువెళ్లేందుకు బస్టాండులో దిగింది. ఆమె వియ్యపురాలు రావడంతో అందరూ కలసి వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగ్ ఎత్తుకొని పారిపోయాడు.
అందులో 12 తులాల బంగారు నగలు ఉన్నాయి. పెద్దశంకరంపేటలోని బ్యాంకు లాకర్లో నుంచి నాలుగు రోజుల కింద పెద్దగొలుసు, కంకణాలు, నాను, వంక ఉంగరం, సాదా ఉంగరం, రూ.8 వేల నగదు ఉన్నట్లు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్కుమార్చెప్పారు.
