152 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34), పూరన్ (35 నాటౌట్), మార్క్రమ్ (35 నాటౌట్) తలో చేయి వేసి సన్రైజర్స్ను గెలిపించారు. ఈ విజయంతో సన్రైజర్స్ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ ఇన్నింగ్స్లో లివింగ్స్టోన్ (60) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.
W W W W
— ESPNcricinfo (@ESPNcricinfo) April 17, 2022
IPL watch out, this SRH team is looking unstoppable ? #PBKSvSRH | #IPL2022