
షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో కొందుర్గ్ , షాద్ నగర్ హైవే వెంట ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ ను టిప్పర్ ఢీకొనడంతో ధ్వంసమైంది. దీంతో నీరంతా భారీ వరదలా రోడ్డుపై పారుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.