విద్య, వైద్య రంగాల్లో ముందుండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

 విద్య, వైద్య రంగాల్లో ముందుండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లాను విద్య, వైద్య, పౌరసరఫరాల విషయాల్లో అధికారులు మరింత బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి జిల్లాను అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో విద్య, వైద్యం, పౌరసరఫరాల శాఖల ప్రగతిపై  జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్​ రాజ్​ మాట్లాడుతూ... విద్యాశాఖ ద్వారా చేపట్టిన బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, డ్రాపవుట్స్, ఎన్​రోల్​మెంట్​పై దృష్టిసారించాలన్నారు.

పలు విషయాలపై సూచనలు చేశారు.  వర్షాకాలం నేపథ్యంలో వేడి ఆహార పదార్థాలు వడ్డించాలన్నారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్​, ఎస్సీ డెవలప్​మెంట్​ఆఫీసర్​విజయలక్ష్మి, డీఎంఅండ్​హెచ్​వో  డాక్టర్ శ్రీరామ్, డీటీడబ్ల్యువో  నీలిమ, డీడబ్ల్యువో హైమావతి,  మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, అధికారులు పాల్గొన్నారు. 

హాస్టల్‌‌ తనిఖీ చేసిన కలెక్టర్

టేక్మాల్, వెలుగు: టేక్మాల్ మండలం కేంద్రంలోని  షెడ్యూల్ కులాల, బీసీ బాలుర వసతి గృహాలను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఆయా హాస్టల్ లలో వంటగది, మరుగుదొడ్లను, విద్యార్థులు నిద్రించే రూమ్ లను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా విద్యార్థుల మెనూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తహసీల్దార్  కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో  ఆన్‌‌లైన్ మాడ్యూల్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తులసీరాం ఉన్నారు.