
- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణంలో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బిల్డింగ్పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలన్నారు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సాంకేతిక విద్య అందించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోనల్ మేనేజర్ అనురాధ, డీఈ రాందాస్, ఎలక్ట్రికల్ డీఈ వాణీలత పాల్గొన్నారు.