దారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు

దారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని  గ్రామస్తులు కొట్టి చంపారు.  హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ  ఘటన చోటు చేసుకుంది. 

ఔరంగాబాద్ గ్రామంలో దుద్దయ్య(63), మరో వ్యక్తికి కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవ జరిగింది. అయితే జూన్ 9న ఆ వ్యక్తి అనారోగ్యానికి  గురై చనిపోయాడు. ఈ క్రమంలో దుద్దయ్య చేతబడి చేయడం వల్లే చనిపోయాడంటూ జూన్ 10న అతనిపై గ్రామస్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలైన దుద్దయ్యను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దుద్దయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.