మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఔరంగాబాద్ గ్రామంలో దుద్దయ్య(63), మరో వ్యక్తికి కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవ జరిగింది. అయితే జూన్ 9న ఆ వ్యక్తి అనారోగ్యానికి గురై చనిపోయాడు. ఈ క్రమంలో దుద్దయ్య చేతబడి చేయడం వల్లే చనిపోయాడంటూ జూన్ 10న అతనిపై గ్రామస్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలైన దుద్దయ్యను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దుద్దయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.