- కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 67.08 శాతం నమోదు పూర్తయిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు.
