- రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచి హోదా దక్కించుకున్న మెదక్ డిగ్రీ కళాశాల
- 1981లో కాలేజీ ప్రారంభం
- ప్రస్తుతం 14 కోర్సులు.. 1,443 మంది విద్యార్థులు
- 21 సంస్థలతో ఎంవోయూ
- మూడుసార్లు న్యాక్ గ్రేడ్ హోదా
మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా ఉండగా.. తాజాగా యూజీసీ నుంచి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ హోదా దక్కింది. రాష్ట్రంలో మొత్తం 149 డిగ్రీ కాలేజీలు ఉండగా అడ్మినిస్ట్రేషన్, ఎంవోయూలు, సీఎస్సార్ అంశాల్లో మెదక్కాలేజీ టాప్10లో ఉండటం ఇందుకు దోహదపడింది.
మొదట్లో బీఏ కోర్సు ఒక్కటే
1981 ఆగస్టులో కేవలం బీఏ కోర్సు ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేండ్లకు బీకాం, బీఎస్సీ ప్రవేశపెట్టారు. కోర్సులకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మెదక్ డిగ్రీ కాలేజీలో14 కోర్సులు ఉన్నాయి.
బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీజెడ్సీఎస్, ఎంపీసీఎస్వంటి సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం1,443 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెగ్యులర్, గెస్ట్ ఫ్యాకల్టీ కలిపి 46 మంది లెక్చరర్లు ఉన్నారు. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 3 ఎన్ఎస్ఎస్యూనిట్లు, ఒక ఎన్ సీసీ యూనిట్ఉన్నాయి.
అప్డేట్ అవుతూ వచ్చిన కాలేజీ
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మెదక్ డిగ్రీ కాలేజీ అప్డేట్అవుతూ వచ్చింది. యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితంగా మూడుసార్లు న్యాక్గ్రేడ్సాధించింది. ఒక సారి బి, మరోసారి బి–ప్లస్, ఇంకోసారి బి–గ్రేడ్దక్కాయి. 2014లో అటానమస్ కు అప్లై చేయాలని కాలేజ్కమిషనరేట్నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేదు.
2023లో న్యాక్ బి–గ్రేడ్ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ అటానమస్ కు అప్లై చేయాలని మరోసారి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అటానమస్ సాధనే లక్ష్యంగా వివిధ కమిటీలు వేసి, ప్రణాళికలు రూపొందించి, అకాడమిక్యాక్టివిటీస్పెంచారు. అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో సెమినార్లు, వర్క్ షాప్ లు, వివిధ అంశాలపై అవేర్నెస్ప్రోగ్రామ్స్నిర్వహించారు.
సీఎస్సార్ నిధులతో సౌకర్యాలు
ఎన్జీవోల సహకారంతో కాలేజీ అభివృద్ధి, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోస్టల్ డిపార్ట్మెంట్తదితర 21 ఆర్గనైజేషన్లతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. సీఎస్సార్కింద ఓ ఎన్జీవో కాలేజీకి 200 ల్యాప్టాప్లు అందజేసింది. మరో ఎన్జీవో రూ.30 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు ఇచ్చింది. ఎన్.వి.లక్ష్మీ ఫౌండేషన్ విద్యార్థినుల కోసం అత్యాధునిక హంగులతో టాయిలెట్స్ నిర్మించింది.
విద్యార్థినులకు సర్వైకల్క్యాన్సర్ నిరోధానికి రూ.8 వేల విలువైన వ్యాక్సిన్ను ఉచితంగా ఇప్పించేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ రెడ్కో సంస్థ తక్కువ కరెంట్తో పనిచేసే 80 ఫ్యాన్లను వితరణ చేసింది.
ఢిల్లీకి చెందిన వాటర్ లైఫ్సంస్థ రూ.24 లక్షలతో ప్యూరిఫైడ్వాటర్ప్లాంట్ఏర్పాటు చేస్తోంది. అలాగే, సుల్తాన్చంద్ట్రస్ట్ 9 మంది విద్యార్థులకు రూ.98 వేల విలువైన ట్యూషన్ఫీజు చెల్లించడంతోపాటు రూ.9.26 లక్షలతో 2 వేల పైచిలుకు పుస్తకాలు అందిస్తామని ప్రకటించింది. ఇన్ఫోసిస్ సంస్థ 40 కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాలేజీలో సోలార్ఎనర్జీ సిస్టం కోసం రూ.35 లక్షలతో ప్రతిపాదనలు పంపారు.
కొత్త కోర్సులకు అవకాశం
డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం సంతోషంగా ఉంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎగ్జామినేషన్బ్రాంచి ఏర్పాటవుతుంది. పరీక్ష పేపర్లను, ఆన్సర్బుక్ లెట్ లను సొంతగా తయారు చేసుకోవచ్చు. విద్యార్థులకు 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు తగ్గుతాయి. స్థానిక అవసరాల దృష్ట్యా నైపుణ్యాలు పెంచేందుకు కొత్తగా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. - హుస్సేన్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్
