బీఆర్ఎస్, కాంగ్రెస్ విజన్లేని పార్టీలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ విజన్లేని పార్టీలు
  • అవినీతి ఆరోపణలకే ఆ పార్టీల నేతలు పరిమితం
  • మెదక్ ఎంపీ రఘునందన్​రావు 

అమీన్​పూర్(పటాన్​చెరు), వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై చిత్తశుద్ధిలేని చర్చ జరుగుతుందని, సభలో ఒకరినొకరు తిట్టుకోడానికే అధికార, ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని ఎంపీ రఘునందన్​రావు ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఐబీ గెస్ట్​ హౌజ్​లో నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరితో కలిసి  రాబోయే మున్సిపల్​ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించారు.

అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్​ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారినా, బీఆర్ఎస్, కాంగ్రెస్​ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.  ఆ పార్టీలకు విజన్​ లేదని, నాణేనికి బొమ్మ, బొరుసులా మారాయని ఎద్దేవా చేశారు.   జిల్లా ప్రధా న కార్యదర్శి రాజశేఖర్​ రెడ్డి నేతలు పాల్గొన్నారు.