- మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నరేశ్ గౌడ్
మెదక్, వెలుగు: మెదక్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేశ్ గౌడ్ ను గురువారం జర్నలిస్ట్లు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఎల్లవేళలా తాను జర్నలిస్ట్లకు అండగా ఉంటానని, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి జర్నలిస్ట్ల సహకారం అవసరమన్నారు. ఎమ్మెల్యే రోహిత్రావు సహకారంతో పిల్లికొటాల్లోని జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, తదితర మౌలిక వసతుల కల్పనకు, అర్హులైన జర్నలిస్ట్లకు ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జర్నలిస్టులు కిషన్, సురేందర్ రెడ్డి, ప్రకాశ్, రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్, రాజశేఖర్, మురళి, రియాజ్, రహమత్, యూసుఫ్ పాల్గొన్నారు.
