
గవర్నమెట్తో పాటు ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రజలు, పశువుల ప్రాణాలకు సంకటంగా మారింది. కొత్తగూడెం పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లోని మెడికల్వేస్టేజీని సిబ్బంది క్యాజువాలిటీ, పోస్టుమార్టం పక్కనే పడేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఈ వేస్టేజీ పక్కనే తిరుగుతుంటారు. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో వేస్టేజీని కుక్కలు చిందరవందరగా చేస్తున్నాయి.
మరో వైపు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని బైపాస్రోడ్డులో ఆ మండలంలోని ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు నిత్యం మెడికల్ వేస్టేజీని కుప్పలు తెప్పలుగా పడేస్తున్నాయి. వాటిని పశువులు తిని ఇబ్బంది పడుతున్నాయి. ఇలా మెడికల్ వేస్టేజీని ఎక్కడపడితే అక్కడ పారేయడం ప్రాణాలకే ముప్పు అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. - భద్రాద్రికొత్తగూడెం, వెలుగు