
- స్థలాన్ని ఆక్రమించి షెడ్లు, గుడిసెలు ఏర్పాటు
మాదాపూర్, వెలుగు: హైటెక్సిటీ మాదాపూర్లోఉన్న మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. బేగంపేట గ్రామ పరిధిలో 24 ఎకరాల 19 గంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గతంలో నీటితో కళకళలాడేది. ఇందులో నీరు నిండాకే సున్నం చెరువులోకి వచ్చి చేరేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ లేక్ నీరు లేక వెలవెలబోతుండగా.. ఇదే అదనుగా అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. చెరువు స్థలంలో మట్టిని నింపే భారీ షెడ్లు ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ వాహనాల పార్కింగ్కు స్థలాన్ని వాడుతున్నారు. స్థలాన్ని కాపాడేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు దానిని తొలగించి మరీ మట్టిని నింపారు. భారీ కారు మెకానిక్ షెడ్లు వెలిశాయి. మరోవైపు కొందరు గుడిసెలు వేసి అద్దెకిస్తున్నారు. టీ కొట్లు, పాన్ షాప్లు నడుస్తున్నాయి. ఈ కబ్జాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.