హైదరాబాద్లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో..మెడ్​ట్రానిక్​​సెంటర్​ విస్తరణ

హైదరాబాద్లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో..మెడ్​ట్రానిక్​​సెంటర్​ విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ హెల్త్​కేర్​ టెక్నాలజీ కంపెనీ మెడ్​ట్రానిక్ పీఎల్​సీ ​సిటీలో రూ. 3 వేల కోట్ల (350 మిలియన్​ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేసిన మెడ్​ట్రానిక్​ ఇంజినీరింగ్​ అండ్​ ఇన్నోవేషన్​ సెంటర్​ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు బయట  హైదరాబాద్​లోని మెడ్​ట్రానిక్​ ఇంజినీరింగ్​ అండ్​ ఇన్నోవేషన్​ సెంటరే అతి పెద్దదని వెల్లడించింది. గ్రోత్​ స్ట్రేటజీలో భాగంగానే ఈ గ్లోబల్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్​ను విస్తరిస్తున్నట్లు తెలిపింది.

మెడ్​ట్రానిక్​ లీడర్షిప్​ టీమ్ ​యూఎస్​లోని  న్యూయార్క్​ సిటీలో తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్​ మినిస్టర్​ కే టీ రామారావును కలిసింది. 2020లో ప్రకటించిన 160 మిలియన్​ డాలర్లకు ఇప్పుడు పెట్టనున్న పెట్టుబడులు అదనమని కంపెనీ పేర్కొంది. మెడ్​ట్రానిక్​ ఇంజినీరింగ్​ అండ్​ ఇన్నోవేషన్​ సెంటర్​లో ప్రస్తుతం 800 మంది పనిచేస్తుండగా, ఈ సంఖ్య రాబోయే 5 ఏళ్లలో 1,500 కి పెంచనున్నారు. ఇంజినీరింగ్​, మొబైల్ యాప్స్​, అప్లికేషన్​ అండ్​ డెస్క్​టాప్​ సాఫ్ట్​వేర్​, క్లవుడ్​–వెబ్​ యాప్స్, డేటా ఇంజినీరింగ్​, ఎంబెడ్డెడ్​ సాఫ్ట్​వేర్​, ప్రొడక్ట్​ సెక్యూరిటీ, సైబర్​–ప్రొడక్ట్​ సెక్యూరిటీ వంటి విభాగాలలో దేశంలోని నిపుణులను నియమించుకోనున్నట్లు మెడ్​ట్రానిక్​ వెల్లడించింది.

రోబోటిక్స్​, ఇమేజింగ్, నావిగేషన్​, సర్జికల్​ టెక్నాలజీస్​, ఇంప్లాంటబుల్​ టెక్నాలజీస్​ వంటి కీలకమైన హెల్త్​కేర్ టెక్నాలజీ రంగాలలో ఇప్పుడు పెట్టే పెట్టుబడులు తమ కంపెనీకి సపోర్ట్​గా నిలుస్తాయని పేర్కొంది. గ్లోబల్​ మెడ్​–టెక్​ సెక్టార్లో హైదరాబాద్​ ఎదుగుదలకు మెడ్​ట్రానిక్​ తాజా పెట్టుబడుల ప్రకటన నిదర్శనంగా నిలుస్తుందని కే టీ రామారావు ఈ సందర్భంగా చెప్పారు. టెక్నాలజీ ఇన్నోవేషన్​కు ఇండియా గ్లోబల్​ హబ్​గా మారుతోందని, హెల్త్​కేర్ ఇన్నోవేషన్​ సెక్టార్లో మరింత పెద్ద మార్కెట్​గానూ ఇండియా మారుతుందని తాము ఆశిస్తున్నట్లు మెడ్​ట్రానిక్​ ఈవీపీ మైక్​ మారినారో పేర్కొన్నారు.