
హైదరాబాద్: పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ మీటింగ్ జరిగింది. నియోజకవర్గ సమస్యలు , స్థానిక ఎన్నికల్లో బలాలు, బలహీనతలు , కమిటీ ల ప్రకటన పై చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో మీనాక్షి సమావేశం నిర్వహిస్తున్నారు.
►ALSO READ | ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడ లేవు: భట్టి