గోదావరి, కావేరి అనుసంధానంపై ఆగస్టు 9న మీటింగ్

గోదావరి, కావేరి అనుసంధానంపై ఆగస్టు 9న మీటింగ్

హైదరాబాద్​, వెలుగు: గోదావరి, కావేరి అనుసంధానంపై ఈ నెల 9న నేషనల్ ​వాటర్​ డెవలప్​మెంట్​అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) సమావేశం కానుంది. హైదరాబాద్​లో నిర్వహించనున్న ఈ భేటీలో అనుసంధాన ప్రాజెక్ట్​పై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను చర్చించనున్నారు. అంశాల వారీగా రాష్ట్ర అధికారుల నుంచి ఎన్​డబ్ల్యూడీఏ అభిప్రాయాలను తీసుకోనుంది. ప్రధానంగా నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్​ నిర్మాణాన్ని సర్కారు వ్యతిరేకిస్తున్నది. 

ఇచ్చంపల్లి వద్ద కడితే దిగువన 24 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తుపాకులగూడెం బ్యారేజీకి ఆకస్మికంగా వచ్చే వరదను నియంత్రించడం కష్టమవుతుందని చెప్తున్నది. రాష్ట్రం​ ఇప్పటికే పలు అభ్యంతరాలను ఎన్​డబ్ల్యూడీఏ ముందు వ్యక్తం చేసింది. బ్రిజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​లో వాటాలు తేలే వరకు నాగార్జునసాగర్​ను బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా వినియోగించరాదని కోరుతున్నది.