ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాక్పై కూర్చొని ఆన్లైన్ గేమ్ ఆడుతున్న యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్శివారులోని డాల్డా కాలనీకి చెందిన ఆకాశ్ గురువారం ఉదయం 11.30 గంటలకు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్వద్దకు వెళ్లాడు. ట్రాక్పై కూర్చొని చెవులకు ఇయర్ఫోన్స్పెట్టుకుని ఆన్లైన్గేమ్ఆడుతున్నాడు. అదే టైంలో మహారాష్ట్ర వెళ్తున్న రైలు యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆకాశ్ ను స్థానికులు రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆకాశ్చనిపోయాడు.