రైలు ఢీకొని యువకుడి మృతి

రైలు ఢీకొని యువకుడి మృతి

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాక్​పై కూర్చొని ఆన్​లైన్​ గేమ్ ఆడుతున్న యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్​శివారులోని డాల్డా కాలనీకి చెందిన ఆకాశ్ గురువారం ఉదయం 11.30 గంటలకు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్​వద్దకు వెళ్లాడు. ట్రాక్​పై కూర్చొని చెవులకు ఇయర్​ఫోన్స్​పెట్టుకుని ఆన్​లైన్​గేమ్​ఆడుతున్నాడు. అదే టైంలో మహారాష్ట్ర వెళ్తున్న రైలు యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆకాశ్ ను స్థానికులు రిమ్స్ హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ ఆకాశ్​చనిపోయాడు.