హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే (పీహెచ్సీ) మానసిక రోగాలకు టెస్టులు, ట్రీట్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మానసిక ప్రవర్తనలో తేడాలను గుర్తించి, కౌన్సెలింగ్ చేసేలా డాక్టర్లకు శిక్షణ ఇవ్వను న్నారు. మందులూ అందుబాటులో ఉంచనున్నారు. టెలీమెడిసిన్ పద్ధతినీ తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో మారుమూల పల్లెల రోగులకు సైతం రాష్ర్ట, జాతీయ స్థాయి నిపుణులతో కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ అందుతుంద ని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తున్నామని, పూర్తి కార్యాచరణ రూపొందించాక డాక్టర్లకు శిక్షణ ఇస్తామని వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ 10 రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్యంపై సర్వే చేయగా 14% మంది ఆ రోగాలతో బాధప డుతున్నట్టు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
