ఆసుపత్రిపై అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షణీయం

ఆసుపత్రిపై అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షణీయం

కొత్తకోట, వెలుగు: పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే జి మధుసూదర్​రెడ్డి కోరడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెపాగ ప్రశాంత్  పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ హైవే పక్కనే ఉన్న కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారన్నారు. 

అభివృద్ధి పనులపై అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని స్థానిక బీఆర్ఎస్  నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఆసుపత్రి కోసం శిలాఫలకం వేశారని విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికల ముందు ఈ విషయం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. వేముల శ్రీనువాస్ రెడ్డి, బీచుపల్లి, మేస్ర్తీ శ్రీను, పాపయ్యగారి కృష్ణారెడ్డి, నరేందర్​రెడ్డి, దిలీప్​రెడ్డి, అంజన్న యాదవ్  పాల్గొన్నారు.