మెర్సీ కిల్లింగ్ మూవీ ఏప్రిల్ 12న విడుదల

మెర్సీ కిల్లింగ్ మూవీ ఏప్రిల్ 12న విడుదల

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సూరపల్లి వెంకటరమణ తెరకెక్కించిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ జరిగే కథ ఇది. హారిక ఆ పాత్రలో బాగా నటించింది. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. 

సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలను దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. ఇందులో మంచి పాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా తీశామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.