గిఫ్టింగ్ ఇండస్ట్రీ కోసం ప్లాట్ఫారమ్

గిఫ్టింగ్ ఇండస్ట్రీ కోసం ప్లాట్ఫారమ్

హైదరాబాద్​, వెలుగు: గిఫ్టింగ్,  స్టేషనరీ పరిశ్రమ కోసం బిజినెస్ ప్లాట్​ఫారమ్​ను ఏర్పాటు చేయడానికి మెస్సే ఫ్రాంక్‌‌ఫర్ట్, ఎంఈఎక్స్​ ఎగ్జిబిషన్స్ చేతులు కలిపాయి. గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్‌‌పో – ఢిల్లీ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశాయి. పేపర్‌‌ వరల్డ్ ఇండియా, కార్పొరేట్ గిఫ్ట్స్ షో,  గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్‌‌పో ఎగ్జిబిషన్​ పోర్ట్‌‌ఫోలియోలను విలీనం చేస్తున్నట్లు తెలిపాయి. 

ఈ ప్లాట్​ఫారమ్​ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగళూరు,  కోల్‌‌కతా వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు.  ఇది కంపెనీలకు డిమాండ్​ను పెంచుతుందని, నేషనల్​ఎకోసిస్టమ్​ఏర్పడుతుందని మెస్సే ఫ్రాంక్‌‌ఫర్ట్, ఎంఈఎక్స్​ ఎగ్జిబిషన్స్ తెలిపాయి. భారతీయ స్టేషనరీ పరిశ్రమ రాబోయే ఐదేళ్లలో 8–-10 శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందుతుందని అంచనా.