V6 News

మెస్సీతో సీఎం ఫుట్ బాల్ మ్యాచ్.. హాజరుకానున్న లోక్‌ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

మెస్సీతో సీఎం ఫుట్ బాల్ మ్యాచ్.. హాజరుకానున్న లోక్‌ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్​ కెప్టెన్గా మ్యాచ్లో పాల్గొననున్న రేవంత్
  • హాజరుకానున్న లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ ​గాంధీ
  • రాత్రి 7.30 గంటలకు ఉప్పల్​ స్టేడియంలో మ్యాచ్​

హైదరాబాద్ / ఉప్పల్ / న్యూఢిల్లీ, వెలుగు: వరల్డ్​ ఫేమస్​ ఫుట్​బాల్​ ప్లేయర్ ​లియోనల్ మెస్సీతో శనివారం రాత్రి ఉప్పల్​ స్టేడియంలో సీఎం రేవంత్​రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్​బాల్ ​మ్యాచ్​ ఆడనున్నారు. మెస్సీ టీమ్ ప్రత్యర్థి జట్టు ‘సింగరేణి ఆర్​ఆర్​ 9’ టీమ్ కెప్టెన్​గా సీఎం రేవంత్​రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్​ కోసం ఉప్పల్​ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మ్యాచ్​ టికెట్లన్నీ ఆన్​లైన్​లో హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ స్టార్ట్ కానున్నది. మెస్సీ కెప్టెన్​గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్​తో సీఎం రేవంత్​ రెడ్డి కెప్టెన్​గా వ్యవహరించే సింగరేణి ఆర్​ఆర్​ 9 టీమ్​ ఢీకొంటుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్​లో చివరి 5 నుంచి 10 నిమిషాల ఆటలో మాత్రమే రెండు టీమ్​ల కెప్టెన్లు పాల్గొంటారు.

సీఎం రేవంత్​ రెడ్డీ జెర్సీ నెంబర్​ 9, మెస్సీ జెర్సీ నెంబర్​ 10 ధరిస్తారు. -మెస్సీ టీమ్​లో పది మంది అండర్‌‌‌‌‌‌‌‌ ప్రివిలేజ్డ్, ఐదుగురు టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్​ అనంతరం మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటవుట్​ కూడా నిర్వహిస్తారు. చారిటీ మ్యాచ్​ కోసం ఒక్కో టికెట్​ను రూ.2,250 నుంచి రూ.10 వేలకు పైగా ధరలకు  ఆన్​లైన్​లోనే అన్నీ టికెట్లు అమ్మేశారు. ఈ మ్యాచ్​ ఆన్​లైన్​లో లైవ్ స్ట్రీమింగ్​కు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్​నేపథ్యంలో స్టేడియం వద్ద రాచకొండ సీపీ సుధీర్​ బాబు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

చారిటీ కోసం మెస్సీతో సెల్ఫీకి రూ.9.95 లక్షలు
అర్జెంటీనాకు చెందిన మెస్సీ 14 ఏండ్ల తర్వాత ‘గోట్​ ఇండియా టూర్​-2025’ పర్యటనలో భాగంగా మన దేశానికి వస్తున్నారు. 2011లో అర్జెంటీనా టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి కోల్‌‌‌‌‌‌‌‌కతాలో వెనిజువెలా టీమ్​తో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ప్రస్తుతం ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు కోల్‌‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటించనున్నారు. 

ఈ సందర్భంగా కోల్​కతా, హైదరాబాద్​లో చారిటీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఉదయం 1.30 గంటలకు మెస్సీ కోల్​కతా చేరుకుంటారు. 11.15  తర్వాత యువ భారతీ స్టేడియానికి మెస్సీ చేరుకొని.. మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు ఫ్రెండ్లీ ఫెసిలిటేషన్​ మ్యాచ్​లో మెస్సీ పాల్గొంటారు.

ఆ తర్వాత షారూఖ్​ ఖాన్, బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోల్​కత్తా నుంచి బయల్దేరి మధ్యాహ్నం 4 గంటల వరకు హైదరాబాద్​చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాజ్​ఫలక్​నామా ప్యాలెస్​కు చేరుకొని.. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. తనతో కలిసి సెల్ఫీలు దిగిన వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.9.95 లక్షల చొప్పున చారిటీ కోసం డబ్బులు వసూలు చేస్తారు. ఇది ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేస్తూనే.. యూనిసెఫ్​ చారిటీకి సహాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యటన చివరి రోజు 15న ఢిల్లీలో ప్రధాని మోదీతో మెస్సీ ప్రోగ్రామ్​ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.