మెస్సీ ఈవెంట్ వివాదం.. ఫ్యాన్‌ కబ్ల్ ప్రెసిడెంట్‌పై గంగూలీ రూ. 50 కోట్ల దావా

మెస్సీ ఈవెంట్ వివాదం.. ఫ్యాన్‌ కబ్ల్ ప్రెసిడెంట్‌పై గంగూలీ రూ. 50 కోట్ల దావా


కోల్‌కతా:  అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్  మెస్సీ కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో పాల్గొన్న ఈవెంట్‌ గందరగోళంగా మారిన నేపథ్యంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై  ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరువు నష్టం దావా వేశాడు. 

ఈ ఈవెంట్ నిర్వహణలో  తాను మధ్యవర్తిగా వ్యవహరించానని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్  ఆఫ్​ కోల్​కతా ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా చేసిన ఆరోపణలను గంగూలీ తీవ్రంగా పరిగణించాడు. ఈ నిరాధారమైన ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేసిన దాదా రూ. 50 కోట్ల భారీ పరువు నష్టం దావా వేశాడు. తాను ఆ ఈవెంట్‌కు కేవలం ఆహ్వానితుడిగా మాత్రమే వెళ్లానని, నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.  గంగూలీ తరపు లాయర్లు ఉత్తమ్ సాహాకు నోటీసులు పంపారు.