
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- శుక్రవారం దంచికొట్టిన వానలు
- వనపర్తి జిల్లా రేమద్దులలో 8.3 సెం.మీ. వర్షపాతం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ రణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు రుతుపవనాలు మరిన్ని జిల్లాలకు విస్తరించాయి. మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని రేమద్దులలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అదే జిల్లా పానగల్, ఆత్మకూరులో 7.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. కాగా, హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డయింది. కుత్బుల్లాపూర్, నాంపల్లి, కూకట్పల్లి, బాలానగర్, నాంపల్లి, కాప్రా, ఖైరతాబాద్లో తేలికపాటి జల్లులు కురిశాయి.