అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర యువతి మృతి

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర యువతి మృతి

హైదరాబాద్ : అమీర్ పేట మెట్రో  స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. స్టేషన్ పెచ్చులూడి పడటంతో ఓ మహిళ చనిపోయింది. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుండగా మహిళపై పెచ్చులు పడ్డాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే చికిత్స జరుగుతుండగానే మౌనిక ప్రాణాలు విడిచింది.

మృతురాలు కూకట్ పల్లి, KPHBకి చెందిన మౌనికగా గుర్తించారు. భారీ వర్షం కురుస్తుండటంతో మౌనిక మెట్రో స్టేషన్‌ మెట్ల కింద ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.