
హైదరాబాద్సిటీ, వెలుగు: ట్రంక్ సీవర్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పూడుకుపోయిన మాన్హోల్స్ను గుర్తించి, భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం వనస్థలిపురం ఓల్డ్ బాంబే– -విజయవాడ హైవే వద్ద ధ్వంసమైన 900 ఎంఎం డయా ఆర్సీసీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్లైన్ మరమ్మతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పైప్లైన్ విస్తరణ పూర్తయిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో సోమవారం సీవర్ లైన్ సుమారు 20 అడుగుల లోతులో కుంగిపోవడంతో వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతు పనులు పనులను చేపట్టారు.