న్యూఢిల్లీ: మరో ఇండియన్–అమెరికన్గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో ఉన్నతస్థానాన్ని అందుకున్నారు. మద్రాస్ ఐఐటీలో చదివిన పవన్దావులూరి విండోస్ మైక్రోసాఫ్ట్, సర్ఫేస్చీఫ్గా నియమితులయ్యారు.
ఆయన 23 ఏళ్లుగా ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. కస్టమ్సర్ఫేస్ ప్రాసెసర్ల తయారీ కోసం పనిచేశారు. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్అమెజాన్లో చేరడంతో పవన్కు బాధ్యతలు అప్పగించారు. పవన్ 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ నుంచి ఎంఎస్చేశారు.