లింగంపేట మండలంలో..మెంగారంలో మిడ్​డే మీల్స్​ షురూ

లింగంపేట మండలంలో..మెంగారంలో మిడ్​డే మీల్స్​ షురూ
  •     వెలుగు కథనానికి స్పందన

లింగంపేట,వెలుగు : లింగంపేట మండలంలోని మెంగారంలోని అప్పర్​ ప్రైమరీ స్కూల్​పిల్లలకు గురువారం మిడ్​డే మీల్స్​షురూచేశారు.'రెండు నెలలుగా పొయ్యి వెలగలే' శీర్షికతో ఈ నెల 5న వెలుగు వార్త ప్రచురించింది. స్పందించిన ఎంఈవో రామస్వామి, స్కూల్​హెడ్​మాస్టర్ ​మోహన్​ఏజెన్సీ నిర్వహకురాలు బాలరాజవ్వను మాట్లాడి వంట చేయడానికి ఒప్పించారు.

దీంతో గురువారం స్కూల్​ స్టూడెంట్స్​కు ఆలు, టమాటా కూరతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. స్కూల్​లో భోజనం షురూ చేయడంతో పేరెంట్స్​హర్షం వ్యక్తం చేశారు.