
హైదరాబాద్సిటీ, వెలుగు : గ్రేటర్ సిటీని వర్షం వదలడం లేదు. మూడు రోజుల పాటు ఆగకుండా కురిసిన వాన మధ్యలో ఒక రోజు గెరువిచ్చినా మంగళవారం అర్ధరాత్రి మళ్లీ దంచి కొట్టింది. బుధవారం పగలంతా వాతావరణం పొడిగా ఉంది. కానీ, రాత్రి 11 గంటల నుంచి మొదలైన వాన రెండు గంటల వరకు నాన్స్టాప్గా పడుతూనే ఉంది.
అత్యధికంగా రాజేంద్రనగర్లో 5.3 సెంటీమీటర్ల వాన పడింది. బంజారాహిల్స్లో5.1, షేక్పేటలో 5.1, ఖైరతాబాద్లో 5.0, విజయనగర్కాలనీ లో 4.8, నాంపల్లి లో4.8, బహదూర్పురా లో 3.9, లంగర్హౌస్ లో 3.7, చార్మినార్లో 3.5, ఉప్పల్లో 3.5, గచ్చిబౌలి లో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది.