- కార్మికులకు వేతనాల పెంపుపై హర్షం
కోల్బెల్ట్/జైపూర్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలకు కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ కార్మికులు వేర్వేరుగా క్షీరాభిషేకాలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పాత బస్టాండ్ఏరియాలో, క్యాతనపల్లిలోని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ ఆఫీస్లో టౌన్ ప్రెసిడెంట్లు మంద తిరుమల్రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, జనరల్సెక్రటరీ పుల్లూరి లక్ష్మణ్, లీడర్లు ఎస్.సుదర్శన్, బండి సదానందం, మందమర్రి టౌన్ఇన్చార్జ్ గోపతి బానేశ్, ఉపేందర్గౌడ్, పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారని, కార్మిక లోకానికి కనీస వేతనాలను పెంచడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ లీడర్లు సీఎం, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేం చేశారు. లీడర్లు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ లీడర్లు సయ్యద్ సజ్జాద్, బండారి సునీల్, అడ్డగుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
