మేడిగడ్డ టూర్​కు ఎంఐఎం లేట్

మేడిగడ్డ టూర్​కు ఎంఐఎం లేట్
  • బస్సులు వెళ్లిన తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
  • సొంత కార్లలో ఉప్పల్ వరకు వెళ్లి.. అక్కడ కాన్వాయ్​బస్సుల్లో పయనం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ టూర్​కు ఎంఐఎం ఎమ్మెల్యేలు లేట్​ అయ్యారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత 11గంటలకు ముఖ్య మంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం నాలుగు బస్సుల్లో బయలుదేరారు. అయితే ఆ బస్సులు బయలు దేరిన15 నిమిషాల తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ మిరాజ్ హుస్సేన్, జుల్ఫీకర్ ఆలీ, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ ఎఫెండి అసెంబ్లీకి చేరుకున్నారు. బస్సులు ఇప్పుడే బయల్దేరాయని అసెంబ్లీ సిబ్బంది వారికి చెప్పారు.

 అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు దృష్టికి తీసుకెళ్లటంతో  అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు సెక్రటరీ ఫోన్ చేసి చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు వచ్చే వరకు కాన్వాయ్ ఉప్పల్ లో ఆపుతామని చెప్పటంతో ఎమ్మెల్యేలు తమ సొంత వెహికిల్స్ లో బయల్దేరి ఉప్పల్ లో సీఎం కాన్వాయ్ తో కలిసి బస్సులు ఎక్కి వెళ్లారు.