బీజేపీని బీట్ చేసినం..అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్

బీజేపీని బీట్ చేసినం..అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్

మున్సి పల్ ఎన్ని కల్లో బీజేపీని బీట్ చేశామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. నిజామాబాద్ లో 16 కార్పొరేటర్లను గెలిచామని,13 సీట్లను గెలుచుకున్న టీఆర్ఎస్ తో కలిసి కార్పొరేషన్ ను గెలుచుకున్నామని ఆయన తెలిపారు. సంఘ్ పరివార్ బీ టీమ్ గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కూడా ఒవైసీ ట్యాగ్ చేశారు. మున్సి పల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పదవులను పంచుకున్నాయన్న ఓ ఇంగ్లిష్ పేపర్ క్లిప్ ను కూడా ట్వీట్ కు యాడ్చేశారు.