రేపు అమిత్‌షాతో మినీ కోర్‌ కమిటీ సమావేశం

రేపు అమిత్‌షాతో మినీ కోర్‌ కమిటీ సమావేశం

రాష్ట్ర బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మినీ కోర్ కమిటీ మీటింగ్ ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర నేతలకు పిలుపు అందింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ  సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యాక్రమాలపైనా డిస్కస్ చేసే అవకాశం ఉంది.