
కోరుట్ల, వెలుగు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లిలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి ధర్మపురికి బయలుదేరారు. మెట్పల్లి మండలం ఆరపేట-, మారుతినగర్ వద్ద ఎదురుగా టోయింగ్ వెహికల్ పాడైన కారును తీసుకొని వస్తుండగా, ప్రమాదవశాత్తు పాడైన కారు మంత్రి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మంత్రి కారు ముందు టైరు ఊడిపోయింది.
డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మరో కారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి వెళ్లిపోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాములు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పరిశీలించారు. గత ఏడాది విప్ హోదాలో ఒకసారి కారు ప్రమాదం నుంచి అడ్లూరి స్వల్ప గాయాలతో బయటపడగా, మంత్రి అయిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరిగింది.