
జోగిపేట, పుల్కల్, వెలుగు: అందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ లో రూ.6.20 కోట్లతో నిర్మించే కేజీబీవీ భవనం, రూ .2.56 కోట్లతో నిర్మించే పీహెచ్సీ భవనం, జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్లతో నిర్మించే స్వాగత తోరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అందోల్లోని మహిళా నర్సింగ్ కాలేజీ, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, రూ. 40 లక్షలతో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. రూ.5.75 కోట్లతో నిర్మించే రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, రూ. 2.45 కోట్లతో నిర్మించే ఐసీడీఎస్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇళ్లను ప్రారంభించారు. రూ.2.45 కోట్లతో నేరెడిగుంటలో పీహెచ్సీ భవనం, మార్కెట్ కమిటీలో రూ. 7.23 కోట్లతో చేపటే కంపౌండ్, షాపింగ్ కాంప్లెక్స్, రైతు వెయిటింగ్హాల్ ఇతర పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో పాండు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మార్క్ఫెడ్చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య , మాజీ కౌన్సిలర్లు నాగరాజ్, సురేందర్ గౌడ్, ప్రదీప్ గౌడ్ , ఏఎంసీ మాజీ చైర్మన్ పద్మనాభ రెడ్డి పాల్గొన్నారు.