రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు

రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు

పాలకుర్తి: కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మేడే సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు చోట్ల మంత్రి జెండా ఆవిష్కరణ చేసి... కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ...నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి గత ఏడాది 176.91 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా మొత్తం 32,350 మంది కార్మికులకు 184.07 కోట్ల రూపాయల సాయం అందించామన్నారు. కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేశామని, దీని ద్వారా కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభిస్తుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని వల్ల ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. దీంతో కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం దొరుకుతోందని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్

నకిరేకల్ టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు