గాంధీని స్మరించుకున్నట్లే.. కేసీఆర్‎ను స్మరించుకోవాలె

గాంధీని స్మరించుకున్నట్లే.. కేసీఆర్‎ను స్మరించుకోవాలె

జనగామ: మహాత్ముడి పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీని ఎలా స్మరించుకుంటున్నామో అలాగే తెలంగాణను తెచ్చిన సీఎం కేసిఆర్‎ను కూడా స్మరించుకోవాలి. కేసీఆర్ పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ. కేసీఆర్ కూడా మహాత్ముడి లాగా శాంతి పోరాటమే చేశాడు. భారతదేశంలో గాంధీని ఇప్పటికీ ఎలా కీర్తిస్తామో.. కేసీఆర్‎ను కూడా భవిష్యత్ తరాలు అలాగే గుర్తు చేసుకుంటారు. జనగామకు నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‎ను కోరాం. వచ్చే సంవత్సరం మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు’ అని ఎర్రబెల్లి అన్నారు.

For More News..

గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త