ఇయ్యాల పంచాయతీ కార్మికులతో మంత్రి చర్చలు

ఇయ్యాల పంచాయతీ కార్మికులతో మంత్రి చర్చలు

హైదరాబాద్, వెలుగు:  సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ నేతలతో సోమవారం పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు చర్చలు జరపనున్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్, నాయకుడు యజ్ఞనారాయణ్ అసెంబ్లీకి వెళ్లి మంత్రిని కలిశారు. తమ సమస్యలపై అసెంబ్లీలోనే చర్చలు జరగాల్సి ఉండగా, బిల్లులపై చర్చలు, సీఎం సమాధానం కారణంగా వాయిదా పడ్డాయని భాస్కర్ తెలిపారు.