-copy-(1)_1svfCHj6S4.jpg)
నెట్వర్క్, వెలుగు: గవర్నర్ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. సిద్దిపేట, గజ్వేల్ మీటింగ్లలో హరీశ్రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. ఎంతో మంది ప్రొఫెసర్లు తయారు కావటానికి అవకాశం ఉన్న యూనివర్సిటీల బిల్లును గవర్నర్ వెనక్కి పంపారని, ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లును 7 నెలలు తొక్కిపెట్టి వెనక్కి పంపటం ద్వారా గజ్వేల్ కు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ చరిత్రను తిరగరాసిన మహా నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఒకప్పుడున్న గతుకుల గజ్వేల్ ఇప్పుడు బతుకుల గజ్వేల్ గా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎఫ్డీసీ చైర్మెన్ ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, ఎలక్షన్రెడ్డి, భూమ్రెడ్డి, ఏఎంసీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధి , సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్అన్నారు. కందిలో జరిగిన సంగారెడ్డి నియోజకవర్గ ప్లీనరీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో మెదక్ లోకసభ టికెట్ బీసీకే ఇవ్వాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు సునీతా గౌడ్, కొండల్రెడ్డి, పద్మ, కంది ఎంపీపీ సరళారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, వైస్ చైర్పర్సన్ లత తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి తెలంగాణాలో ఓట్లడిగే హక్కు లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణాలో అమలవుతున్నసంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన తరువాతే ఇక్కడ ఓట్లు అడగాలన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు.
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, వైస్ చైర్మెన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మెన్ జగపతి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు సోములు, బీఆర్ఎస్ మెదక్ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండానే ఎగురుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం దుబ్బాకలో ప్లీనరీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్ పాల్గొన్నారు. చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, జిన్నారం మండలాల్లోని అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి.